వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై రాజ్‌నాథ్‌తో కెసిఆర్‌ భేటీ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు భేటీ వాయిదా పడింది. కెసిఆర్‌ ఈ నెల 19వ తేదీన రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలవాల్సి ఉంది. అయితే ఆయన ఈ రోజు రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కావడం లేదు. అయితే 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా కెసిఆర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.

ఇదిలావుంటే, తెరాస నేత నరేంద్ర ఢిల్లీలో మకాం వేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి మద్దతు ఇస్తే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి ఉండడంతో నరేంద్ర ఆ ప్రయత్నాలు సాగిస్తున్నారు. బిజెపి నుంచి సానుకూల ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో నరేంద్ర ప్రయత్నాలకు ప్రాధాన్యం చేకూరింది. యుపిఎ ప్రభుత్వ పక్షాన బిజెపికి లేఖ రాయించేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X