వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిసి క్రీమిలేయర్పై రేపు అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల క్రీమీ లేయర్ వ్యవహారంపై ప్రభుత్వం రేపు (శుక్రవారం) అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ల వర్తింపు ఆదాయ పరిమితి విధించాలనే విషయంపై తాము ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని బిసి సంక్షేమ శాఖ మంత్రి డి. శ్రీనివాస్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నవారి సంతానాన్ని, వార్షిక ఆదాయం నాలుగు లక్షలు మించినవారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే దీనిపై తీవ్ర విభేదాలు పొడసూపాయి. తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుండగా, సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి సమర్థిస్తున్నాయి.
Comments
Story first published: Thursday, February 16, 2006, 23:53 [IST]