పోలవరంపై అసెంబ్లీ స్తంభన: రేపటికి వాయిదా
హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేశాయి. ఎంతకీ సద్దు మణగకపోవడంతో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. గురవారం సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తిరస్కరించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంది. మిగతా ప్రతిపక్షాలు కూడా పోలవరంపై చర్చకు పట్టుబట్టాయి.
టీ విరామం తర్వాత చర్చకు తాము సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పడంతో సభ సద్దుమణిగింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని చేపట్టారు. ఈ సమయంలో గోదావరి జలాలపై రభ జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని తెరాస విమర్శించింది. తెరాస సభ్యుడు హరీష్రావు, తెలుగుదేశం సభ్యుడు సిహెచ్. రాజశ్వేరరావు, సిపియం సభ్యుడు నోముల నరసింహయ్య ప్రభుత్వ వైఖరిని నిరసించారు.
పోలవరంపై తీవ్ర రభస జరగడంతో స్పీకర్ సురేష్ రెడ్డి సభను రెండు సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సద్దుమణగకపోవడంతో రేపటికి వాయిదా వేశారు.