వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
ఆందోళనకారులు పాతబస్తీలో ముర్గీచౌక్ వైపు వెళ్లారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ప్రవక్త కార్టూన్లకు వ్యతిరేకంగా మెహిదీపట్నంలో ప్రారంభమైన ర్యాలీ మల్లేపల్లి వైపు వెళ్లింది. మజ్లీస్ కార్పోరేటర్ గౌస్ను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఆందోళనకారులు బస్సును, డిసియం వ్యాన్ను, ఆటోను ధ్వంసం చేశారు.
ఘర్షణలో గాయపడ్డ ఐదుగురిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. అల్లర్లకు బాధ్యులైన సుమారు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Friday, February 17, 2006, 23:53 [IST]