వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్షల్స్‌తో తెరాస ఎమ్మెల్యేల గెంటివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శుక్రవారం రెండో రోజు కూడా శాసనసభలో రభస జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో వారిని రెండు రోజుల పాటు స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసిన తర్వాత వెళ్లిపోకుండా స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించడంతో వారిని మార్షల్స్‌ చేత బయటకు గెంటివేయించారు. అనంతరం తెరాస సభ్యులు ధర్నా చేశారు.

శుక్రవారం సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ఐదు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్‌ తిరస్కరించారు. అయితే తెరాస సభ్యులు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సభా కార్యక్రమాల స్తంభనకు పూనుకున్నారు. సభ్యులు కొందరు మాట్లాడుతున్న సమయంలో కూడా తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. దాంతో వారి సస్పెన్షన్‌కు తీర్మానాన్ని ప్రతిపాదించాలని స్పీకర్‌ శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యకు సూచించారు. దీంతో ఆయన తీర్మానం ప్రతిపాదించారు. ఆ సమయంలో సభలో లేని కొప్పుల ఈశ్వర్‌ను కూడా సస్పెండ్‌ చేయడం గమనార్హం.

సంఖ్యాబలంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని తెరాస శాసనసభ్యులు విమర్శించారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న గిరిజనులను కూడగట్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగా గర్జన నిర్వహిస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని వారు చెప్పారు. జట్టు చేతికిచ్చి ఇప్పుడు మొత్తుకుంటే ఏం లాభమని అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై ఒక విసురు విసిరారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X