వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులకు లొంగిపోయిన మజ్లీస్ నేతలు
హైదరాబాద్: మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, చార్మినార్ శాసనసభ్యుడు సయ్యద పాషా ఖాద్రీ, తదితర మజ్లీస్ నాయకులు ఆదివారంనాడు పోలీసులకు లొంగిపోయారు. హైదరాబాద్ అల్లర్లలో ప్రమేయం ఉందంటూ వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అల్లర్లను జరగకుండా చూడడంలో విఫలమైన పోలీసులు చేతగానితనంతోనే తమపై కేసులు పెట్టారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. వర్ధమాన దేశాల పట్ల పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా హిందూముస్లింలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Story first published: Sunday, February 19, 2006, 23:53 [IST]