వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ-1 ఉప ఎన్నిక: పోలింగ్ ప్రశాంతం
విశాఖపట్నం: విశాఖపట్నం - 1 శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఆదివారంనాడు ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం-1కు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రోణంరాజు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దాంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ల మధ్య హోరాహోరి పోటీ జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ తమ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
Comments
Story first published: Sunday, February 19, 2006, 23:53 [IST]