వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాఠశాలల తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: జంటనగరాల్లోని పాఠశాలల పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని అంబర్పేటలో గల ప్రగతి విద్యా నికేతన్ ఉన్నత పాఠశాలలో అధ్వాన్నంగా ఉన్నాయని, గోడలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్వరూపారావు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు రిట్గా స్వీకరించింది.
కనీస సౌకర్యాలు లేకుండా అధ్వాన్న స్థితిలో జంటనగరాల్లోని యాజమాన్యాలు పాఠశాలలు నడుపుతున్నాయని హైకోర్టు సోమవారం విమర్శించింది. జంటనగరాల్లోని అన్ని పాఠశాలల పరిస్థితిపై ఈ నెల 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Story first published: Monday, February 20, 2006, 23:53 [IST]