వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.94.32 కోట్ల లోటు బడ్జెట్‌ ప్రతిపాదన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విశాఖపట్నం -1 శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందనుకుంటున్న సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్‌ పిడుగులాంటి ప్రకటన చేసింది. పోలింగ్‌ జరిగిన తీరుపై ఎన్నికల కమీషన్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. తాము చెప్పే దాకా ఓట్లను లెక్కించవద్దని ఆదేశించింది. దీంతో బుధవారం విజేత ఎవరో తెలిసిపోతుందని భావించినవారికి నిరాశే మిగిలింది.

యధేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన, డబ్బు, మద్యం పంపిణీ ఆరోపణలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాతనే ఓట్ల లెక్కింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఓట్ల లెక్కింపును ఆపేశారు. అవసరమైతే ఆరోపణలపై విచారణ చేపట్టడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకాధికారి వచ్చే అవకాశం ఉంది. విశాఖ - 1 ఉప ఎన్నిక పోలింగ్‌ విషయంలో ఏం చేయాలన్నది సోమవారం నాడు నిర్ణయం తీసుకుంటారు. నియమాల ఉల్లంఘన నిజమని తేలితే పోలింగ్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.

నియమాల ఉల్లంఘనపై శనివారంనాడు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావును ఆదేశించింది. అయితే ఆరోగ్యం బాగా లేదనే కారణంతో ఆయన వివరణ ఇవ్వలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X