గంగూలీకి గుడ్బై చెప్పిండి: వాడేకర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకునే సమయం వచ్చిందని భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అజిత్ వాడేకర్ అన్నారు. ఇంగ్లాండు టెస్టు సిరీస్కు గంగూలీని ఎంపిక చేసినా అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ మాత్రమేనని, అంతర్జాతీయ క్రికెట్లో తనకు రోజులు దగ్గర పడ్డాయని గంగూలీ గమనించడం అవసరమని ఆయన అన్నారు.
గంగూలీని ఎంపిక చేస్తే ప్రమాదమేమీ లేదని, అయితే గంగూలీకి రోజులు కావని, దిగిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆసీస్ కెప్టెన్ స్టీవ్వాకు ఆ విషయం కచ్చితంగా చెప్పారని ఆయన అన్నారు. నిజాయితీగా మాట్లాడుకోవడం అవసరమని, వాస్తవాలను అంగీకరించక తప్పదని, గంగూలీ లేకుండానే భారత జట్టు విజయం సాధిస్తోందని, యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని, ఇది నీకు చివరి ఏడాది, థ్యాంక్స్ అని గంగూలీకి గుడ్బై చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.