వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిర్‌గ్లానీ నివేదికపై చిచ్చులో వైయస్‌ పాత్ర?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ప్రీజోన్‌గా చేయాలని మంత్రి జె.సి. దివాకర్‌ రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి ప్రకటనలు చేయడం వెనక ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి పాత్ర ఉందా? ఆ ప్రకటనల వెనక వైయస్‌ హస్తం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కళ్లెం యాదగిరి రెడ్డి, మధుసూదనా చారి అంటున్నారు. గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికను యధాతధంగా అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా మంద్రి దివాకర్‌ రెడ్డి ప్రకటన చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు.

మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన దివాకర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికను యధాతథంగా అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చాటుకోవడానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే మరో వైపు దాన్ని వివాదంగా మార్చడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డారని వారన్నారు. గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదిక హైదరాబాద్‌ను ఆరవ జోన్‌లో చేర్చింది. దీని వల్ల హైదరాబాద్‌లో పరిమితికి మించి ఉన్న స్థానికేతర ఉద్యోగులను తమ తమ స్వస్థలాలకు పంపించాల్సి వుంటుంది. దీంతో వివాదం చెలరేగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X