వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతలో గ్యాస్ విస్ఫోటనం: ఇద్దరు మృతి
అనంతపురం: అనంతపురంలో బుధవారంనాడు గ్యాస్ విస్ఫోటనం సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఒక బాలుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతపురంలోని చాపలవీధిలో అంగడి లక్ష్మమ్మ అనే మహిళ తన ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ప్రయత్నించిన సమయంలో అప్పటికే లీక్ అయిన గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా ఇంటికి మంటలు అంటుకున్నాయి.
మంటలు పక్క ఇంటికి కూడా వ్యాపించాయి. ఆ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. అంగడి లక్ష్మమ్మతో పాటు పక్కింటిలోని మహిళ చెన్నమ్మ కూడా మరణించింది. అంగడి లక్ష్మమ్మ కుమారుడు బాలకృష్ణ గాయాలతో బయటపడ్డాడు. పక్కింట్లో సాధారణంగా తొమ్మిది మంది ఉంటారని, ప్రమాదం జరిగిన సమయంలో వారు ఇంట్లో లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
Comments
Story first published: Wednesday, February 22, 2006, 23:53 [IST]