వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డియస్పీ ముందు లొంగిన ఎమ్యెల్యే తోట

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) బాబూరావుపై దాడి కేసులో శాసనసభ్యుడు తోట నరసింహం బుధవారంనాడు రాజమండ్రి డియస్పీ ముందు లొంగిపోయారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నందుకు ఎమ్మార్వో బాబూరావుపై శాసనసభ్యుడు తోట నరసింహం, ఆయన అనుచరులు 30 మంది దాడి చేశారనే ఆరోపణపై కేసు నమోదైంది. బాబూరావు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.

అవినీతి ఎమ్మార్వోకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తోందని తోట నరసింహం విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై కేసు నిరూపణ అయితే రాజీనామా చేస్తానని ఆయన సవాల్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X