వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం: 4గురు మృతి
విశాఖపట్నం: తూర్పు నౌకాదళానికి చెందిన ఐయన్యస్ మగర్ యుద్ధ నౌకలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురురు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నేవీ అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఎంతో సేపు సాధ్యం కాలేదు. వాడిన క్షిపణులను సముద్రంలో పడవేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.
మరణించినవారిని అశోక్కుమార్, శీతల్ దాస్, బిషన్సింగ్, ప్రమోద్ దేవీలుగా గుర్తించారు. గతంలో కూడా క్షిపణుల పేలుడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల్లో గతంలో ఒక బాలిక కూడా మృతి చెందింది. ఈ సంఘటనపై తూర్పు నావికా దళం విచారణ చేపట్టింది.
Comments
Story first published: Thursday, February 23, 2006, 23:53 [IST]