వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం: 4గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తూర్పు నౌకాదళానికి చెందిన ఐయన్‌యస్‌ మగర్‌ యుద్ధ నౌకలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురురు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నేవీ అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఎంతో సేపు సాధ్యం కాలేదు. వాడిన క్షిపణులను సముద్రంలో పడవేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.

మరణించినవారిని అశోక్‌కుమార్‌, శీతల్‌ దాస్‌, బిషన్‌సింగ్‌, ప్రమోద్‌ దేవీలుగా గుర్తించారు. గతంలో కూడా క్షిపణుల పేలుడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల్లో గతంలో ఒక బాలిక కూడా మృతి చెందింది. ఈ సంఘటనపై తూర్పు నావికా దళం విచారణ చేపట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X