వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వ భూముల దారాదత్తంతో కష్టాలే: బాబు
హౖదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని భూములను తన ఇష్టారాజ్యంగా దారాదత్తం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఆయన పార్టీ నగర కార్యాలయం భవనానికి గురువారంనాడు శంకుస్థాపన చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు.
హైదరాబాద్లోనూ, హైదరాబాద్ పరిసరాల్లోనూ ఉన్న ప్రభుత్వ భూములను పరిశ్రమల స్థాపనకంటూ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెడుతోందని, దాని వల్ల మధ్యతరగతివారు, పేదలు హైదరాబాద్లో జీవించలేని స్థితి ఏర్పడుతుందని ఆయన ఆయన అన్నారు. పేదల సొంత ఇంటి కల కల్లలయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల పేదలు అనేక ఇక్కట్ల పాలవుతున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, February 23, 2006, 23:53 [IST]