వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీడియాలో విద్యాసంస్ధల యాడ్స్పై నిషేధం
హౖౖెదరాబాద్: ప్రయివేట్ విద్యాసంస్ధలు, కోచింగ్ సెంటర్లు కిరాణా దుకాణాలుగా మారాయని రాష్ట్ర హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ విద్యా సంస్ధలు పత్రికల్లో, టీవీల్లో వ్యాపారప్రకటనలు ఇవ్వరాదని శుక్రవారం ఆదేశించింది. విద్యావ్యాపారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. విద్యావ్యాపారం వెర్రితలలు వేయకూడదనేదే తమ ఉద్దేశమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను మార్చి నాలుగో తేదీకి వాయిదా వేసింది.
Comments
Story first published: Friday, February 24, 2006, 23:53 [IST]