వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్కు పిజెఆర్ మరో నిరసన లేఖ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి మరో లేఖాస్త్రం సంధించారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ముఖ్యమంత్రికి శుక్రవారం ఒక లేఖ రాశారు. బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్ అన్యాయం జరిగిందని ఆయన ఆ లేఖలో అన్నారు.
హైదరాబాద్కు కృష్ణానదీ జలాలను తరలించే మూడవ దశ ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీ ప్రస్తావన బడ్జెట్లో ఎందుకు లేదని ఆయన అడిగారు. సాగునీటికి పెద్ద యెత్తున 51 శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం గోదావరి నదిపై తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఎందుకు కేటాయింపులు జరపలేదని ఆయన ప్రశ్నించారు.
Story first published: Friday, February 24, 2006, 23:53 [IST]