రైల్వే బడ్జెట్ : సామాన్య ప్రయాణికులకు ఊరట
న్యూఢిల్లీ: ప్రయాణికులపై భారం వేయకుండా రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2006-07 బడ్జెట్ను శుక్రవారంనాడు లోక్సభలో ప్రతిపాదించారు. ఎసి ఫస్ట్ క్లాస్ చార్జీలను 18 శాతం, ఎసి సెకండ్ క్లాస్ చారీజలను పది శాతం తగ్గించారు. పేదలకు లాలూ తన బడ్జెట్లో పలు సౌకర్యాలను కల్పించారు. వచ్చే కొత్తగా 55 రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్యాసింజర్ రైళ్లలో చార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పేదల కోసం పూర్తి కండీషన్డ్ గరీబ్ రథ్ రైళ్లను నాలుగింటిని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్లలో ప్రస్తుత ఎసి త్రీ టయర్ థర్డ్ క్లాస్లో కంటే ఈ రైళ్లలో 25 శాతం చార్జీలు తక్కువగా ఉంటాయి. సరుకుల గ్రూప్ల సంఖ్యను 80 నుంచి 28కి తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీగా 23,475 కోట్ల రూపాయల కేటాయింపు జరిపారు. చార్జీల ద్వారా 16,800 కోట్ల రూపాయలు, సరుకుల రవాణా ద్వారా 40,320 కోట్ల రూపాయలు ఆదాయం రాగలదని అంచనా వేశారు. 190 రైళ్లలో బోగీల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రైళ్లలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కాలనీలను నిర్మిస్తామని, ఉద్యోగుల వైద్య సదుపాయాల కోసం పాట్నాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసిల ఉద్యోగాలకు ఒక సంవత్సరం వయోపరిమితిని పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 23 కొత్త లైన్ల సర్వే నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సైబర్ కేఫ్లు, ఎంటియం సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఇ- టికెట్లపై చార్జీలు తగ్గిస్తామని ఆయన చెప్పారు. స్లీపర్ క్లాస్లో పాలవ్యాపారులకు, రైతులకు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల ప్రయాణ సమయాన్ని తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. ప్యాసింజర్ రైళ్లలో వసతులను మెరుగు పరుస్తామని ఆయన చెప్పారు. 2006-07లో 550 కిలోమీటర్ల కొత్త లైన్లను మంత్రి ప్రతిపాదించారు.
12 రైళ్ల ప్రీక్వెన్సీని పెంచుతున్నట్లు, 19 రైళ్ల గమ్యస్థానాలను పెంచుతున్నట్లు లాలూ చెప్పారు. రూ. 22 వేల కోట్ల ఫ్రయట్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాగన్ లోడ్ను 4 టన్నుల నుంచి 8 టన్నులకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 31వ తేదీ నుంచి ప్రైవేట్ కంటెయినర్లను అనుమతిస్తామని ఆయన చెప్పారు. 11 కి.మీ. మేర గేజ్ మార్పిడి పనులు చేపడతామని ఆయన తెలిపారు. పదవ పంచ వర్ష ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలను సాధించామని ఆయన చెప్పారు.