వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అడిడాస్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంకుస్ధాపన
నెల్లూరు: ప్రపంచ ప్రఖ్యాత అపాచి అడిడాస్ పాదరక్షల సంస్ధ కర్మాగారానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం శంకుస్ధాపన చేశారు. నెల్లూరు జిల్లా తడ సమీపంలోని మాంబట్లలో అడిడాస్ కర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం ఆయన ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, నేదురుమిల్లి రాజ్యలక్ష్మి, కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి పాల్గొంటున్నారు. రాజశేఖరరెడ్డి శనివారం రాత్రి నెల్లూరులోనే బస చేసి ఆదివారం ఉదయం కావ లి నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు.
Comments
Story first published: Saturday, February 25, 2006, 23:53 [IST]