వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీలో ఆలయంపై దాడి, ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని కార్వాన్ ప్రాంతంలో శనివారం ఉదయం దర్భార్ మైసమ్మ గుడిపై ఒక వర్గం వారు రాళ్ళతో దాడి జరగడంతో పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ముఖద్వారం దాడిలో ధ్వంసమైంది. దీనితో ఒక వర్గానికి చెందిన వారు మూడు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆలయంపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషద్ ఖండించింది. బిజెపి దాని అనుబంధ సంస్ధలకు చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయవలసి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా పాత బస్తీలో పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు.
Story first published: Saturday, February 25, 2006, 23:53 [IST]