వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ కార్యాలయాల ముట్టడి: సిపియం హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వ్యవసాయానికి విద్యుత్‌ సరిగా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ తలపెట్టిన పాదయాత్ర సందర్బంగా ఆయన ఆదివారంనాడు హయత్‌నగర్‌లో ఫొటో ప్రదర్శనను ప్రారంభించి ప్రసంగించారు. వ్యవసాయానికి ఏడు గంటలైనా సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయానికి ఏడు గంటలకు మించి విద్యుత్‌ ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం దాన్ని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, దఫా దఫాలుగా ఇవ్వడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సరే వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X