వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెస్సార్ వ్యాఖ్యలు పట్టించుకోవద్దు: వైయస్
నెల్లూరు: రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు మాటలను పట్టించుకోనవసరం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డిపై సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సత్యనారాయణరావు చాలా సీనియర్ అని, సత్యనారాయణరావు ఏదో మాట్లాడుతుంటారని, వాటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని అడిగిన వారికి ఈసారి బడ్జెట్లో జరిపిన కేటాయింపులే సమాధానమని ఆయన చెప్పారు. పంచాయతీల విలీనానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, February 26, 2006, 23:53 [IST]