వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భవిష్యత్తులో తెలుగులో మాట్లాడుతా: సింఘ్వీ
తిరుపతి: భవిష్యత్తులో తాను తెలుగులో మాట్లాడుతానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ అన్నారు. ఆయన ఆదివారంనాడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హిందీలో మాట్లాడి ఆయన తన మాతృభాషాభిమానాన్ని చాటుకున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య విభేదాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఎసి గదుల్లో కూర్చుని ప్రజల హక్కుల గురించి మాట్లాడటం బాధ్యత అనిపించుకోదని, సామాజిక బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, February 26, 2006, 23:53 [IST]