వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ వేరు, పాక్ వేరు: జార్జి బుష్
ఇస్లామాబాద్: భారతదేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందం నమూనా పాకిస్ధాన్కు వర్తించదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ స్పష్టం చేశారు. భారత్, పాక్ దేశాల అవసరాలు, చారిత్రాకాంశాలు విభిన్నమైనవని బుష్ అభిప్రాయపడ్డారు. భారత్లో పర్యటించిన అనంతరం పాకిస్ధాన్లొ పర్యటిస్తున్న జార్జి బుష్ను విలేకరులు మన్మోహన్ సింగ్తో కుదుర్చుకున్నటువంటి అణు ఒప్పందాన్ని పాకిస్ధాన్తోనూ కుదుర్చుకుంటారా అని ప్రశ్నించినప్పుడు బుష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాకిస్ధాన్ అణుశక్తి పితామహుడు ఎ.క్యు ఖాన్ గృహ నిర్భంధంలో ఉన్న సమయంలో బుష్ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
Comments
Story first published: Saturday, March 4, 2006, 23:53 [IST]