వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిరుద్యోగులకు రాష్ట్రంలో కొత్త పథకం
హైదరాబాద్: రాష్ట్రంలో 30 వేల మంది నిరుద్యోగులకు నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందిరమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కొరత ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వంద శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, అయిదోతర గతి వరకు చదువుకున్న నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ర్స్టక్షన్ అధికారులను ఆదేశించారు. అకాడమీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చెప్పారు.
Comments
Story first published: Saturday, March 4, 2006, 23:53 [IST]