వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజంపేటలో భవంతి కూలి 10 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా రాజంపేటలో ఒక భవంతి కూలి పది మంది దుర్మరణం పాలయ్యారు. అధికారులు రోడ్ల విస్తరణలో భాగంగా భవనాలను కూల్చి వేస్తున్న సమయంలో ఒక భవనం కూలి అందులోని పది మంది అక్కడికక్కడే మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రోడ్ల విస్తరణలో భాగంగా అధికారులు కట్టడాల కూల్చివేతను చేపట్టారు. చాలా మంది స్వచ్ఛందంగానే తమ ఇళ్లను కూల్చి వేసుకుంటున్నారు. ఆదివారంనాడు కొన్ని భవంతుల కూల్చివేతను అధికారులు చేపట్టారు. ఈ సమయంలో ఒక భవంతిని కూల్చి వేస్తుండగా పక్కనే మరో భవంతి కుప్పకూలింది. దాంతో అందులోని పది మంది దుర్మరణం పాలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X