వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేయి కోట్ల అవినీతి నిజమని తేలింది: సిపియం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన పత్రాలను బట్టి సాగునీటి ప్రాజెక్టులలో వేయి కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని తేటతెల్లమైందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. సందర్బాన్ని బట్టి తాము కూడా అందుకు సంబంధించిన పత్రాలను బయటపెడతామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పత్రాలను బయటపెట్టడం మంచిదైనప్పుడు తాము సమర్థిస్తామని ఆయన చెప్పారు.
గిరిజన సమస్యలపై ఈ నెల 9వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాలని సిపియం నిర్ణయించింది. బహిరంగ కూడా జరుగుతుందని రాఘవులు చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన నిధుల కేటాయించలేదని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Sunday, March 5, 2006, 23:53 [IST]