వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్షాల వాకౌట్
హైదరాబాద్: శ్రీరాంసాగర్, ఎల్లంపలి తదితర నీటిపారుదల ప్రాజెకుల్టపై సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసి, స్పీకరు పోడియంలోకి దూసుకెళ్ళడంతో తెలుగుదేశం, వామపక్షాలు, టిఆర్ఎస్, ఎంఐఎం శాసనసభ్యులను స్పీకరు సస్పెండ్ చేశారు. విపక్షాలు లేకుండా సభా కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారంటూ బిజెపి, బిఎస్పీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి శాసనసభపై గౌరవం లేదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిడిపి శాసనసభ్యులు సభాద్వారం వద్ద బైఠాయించగా, వామపక్షాలు, ఎంఐఎం సభ్యులు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి విడుదల చేసిన 400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన ఫైళ్ళను స్పీకరు ముందు ఉంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Comments
Story first published: Monday, March 6, 2006, 23:53 [IST]