వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ బర్తరఫ్పై లోక్సభలో యుపిఎ సభ్యుల పట్టు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని బర్తరఫ్ చేయాలని సోమవారం లోకసభలో యుపిఎ సభ్యులు పట్టు పట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. గోధ్రా రైల్వేస్టేషన్లో సభర్మతి ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రవాదుల హస్తం లేదని బెనర్జీ కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ కేసులో పోటా కింద అరెస్టయినవారిని విడుదల చేయాలని, గుజరాత్లో అల్లర్లకు కారణమయిన నరేంద్ర మోడిని బర్తరఫ్ చేయాలని యుపిఎ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.
Comments
Story first published: Monday, March 6, 2006, 23:53 [IST]