వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాధిత మహిళలను దోచుకుంటున్న పోలీసులు: తేజ్దీప్
హైదరాబాద్: భర్తల, అత్తమామల హింస నుంచి తమను రక్షించాలని ఆశ్రయిస్తున్న మహిళలను పోలీసులు, న్యాయవాదులు దోచుకుంటున్నారని సీనియర్ ఐపిఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తేజ్దీప్ కౌర్ మీనన్ సోమవారం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని ఆమె అన్నారు. పోలీసులకు వచ్చే అక్రమ ఆదాయం ఎక్కువగా ఇటువంటి కేసుల నుంచే వస్తోందని ఆమె వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడంపై మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయంలో జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి పోలీసు వ్యవస్ధ మీదే తేజ్దీప్ విరుచుకు పడడం విశేషం.
Comments
Story first published: Monday, March 6, 2006, 23:53 [IST]