వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
72 జీవోపై అఖిలపక్ష సమావేశం: రోశయ్య హామీ
హైదరాబాద్: జీవో నెంబరు 72పై చర్చకు రెండు మూడు రోజుల్లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులకు హామీ ఇచ్చారు. గిర్గ్లానీ కమీషన్ నివేదిక, 610 జీవో స్ఫూర్తిని దెబ్బ తీస్తూ రాష్ట్ర ప్రభుత్వం 72 నెంబర్ జీవోను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు బుధవారం శాసనసభలో విమర్శించారు.
జీవో నెంబరు 72 వల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అంటూ దీనిపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, అందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు రోశయ్య అంగీకరించారు.
Comments
Story first published: Wednesday, March 8, 2006, 23:53 [IST]