వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెస్ట్ బేకరీ కేసులో జహీరాకు జైలు శిక్ష
న్యూఢిల్లీ: బెస్ట్ బేకరీ కేసులో తప్పుడు వాంగ్మూలం ఇచ్చింనదుకు సుప్రీంకోర్టు జహీరా షేక్కు ఒక ఏడాది జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించింది. బెస్ట్ బేకరీ కేసులో సాక్షి జహీరా షేక్ తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందని అంటూ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను బుధవారం సుప్రీంకోర్టు ఆమోదించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జహీరా జైలు శిక్ష అనుభవించాలని జస్టిస్ అర్జిత్ పసాయత్, జస్టిస్ హెచ్.కె. శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
జహీరా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని కోర్టు ఆదాయం పన్ను అధికారులను ఆదేశించింది. 2000 నుంచి ఇప్పటి వరకు జహీరా ఆదాయ మార్గాలను కనిపెట్టాలని కూడా కోర్టు ఆదాయం పన్ను శాఖ అధికారులకు సూచించింది. బెస్ట్ బేకరీ కేసులో జహీరా షేక్ తన సాక్ష్యాన్ని మార్చిందని ఆరోపణపై ఈ శిక్ష పడింది.
Comments
Story first published: Wednesday, March 8, 2006, 23:53 [IST]