వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాలూరు ఎమ్యెల్యే బంజ్దేవ్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరు శాసనసభ్యుడు బంజ్దేవ్ కొండదొర కారని, ఒరిస్సాకు చెందిన క్షత్రియుడని హైకోర్టు తీర్పు చెప్పింది. బంజ్దేవ్ గిరిజన తెగ ( ఎస్.టి.) కి చెందనివాడని, అందువల్ల శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బంజ్దేవ్ నిర్ణయించుకున్నారు. తాను ఇంకా తీర్పు పాఠం చూడాల్సి వుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర గెలిచినట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పు పట్ల రాజన్నదొర హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లడానికి బంజ్దేవ్కు హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. దీంతో తీర్పు అమలును వచ్చే నెల 7వ తేదీ వరకు సస్పెన్షన్లో ఉంచింది. బంజ్దేవ్ ఎస్టి కాదని కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజన్నదొర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై రెండేళ్ల పాటు విచారణ జరిగింది.
Story first published: Friday, March 10, 2006, 23:53 [IST]