వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రబెల్లి దయాకర్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవర్తన పట్ల స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి శుక్రవారం శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిరైతుకు గిట్టుబాటు ధర లభించకపోవడంపై ప్రశ్న వేయాల్సిన దయాకర్‌ రావు గతంలో వేసిన ప్రశ్నలను ఉటంకిస్తూ పోసాగారు. దీంతో దయాకర్‌ రావును స్పీకర్‌ మందలించారు. దయాకర్‌ రావు తీరు పట్ల తెలుగుదేశం సీనియర్‌ శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు.

దయాకర్‌రావుపై మండిపడడంతో సరిపెట్టకుండా సభలో సభ్యుల ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు ఎలా ప్రశ్నలు వేయాలో, మంత్రులు ఎలా సమాధానం చెప్పాలో వవరణ ఇచ్చారు. సభ్యులు వేసే ప్రశ్నలు నిర్దిష్టంగా ఉండాలని, మంత్రులు కూడా నిర్దిష్టంగా సమాధానాలు చెప్పాలని, దాని వల్ల సమయం ఆదా అవుతుందని ఆయన అన్నారు. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ప్రతిపక్షాల సభ్యులు తెలియజేస్తూ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X