వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బోఫోర్స్ పత్రాలను పార్లమెంటులో ఉంచాలి: అద్వానీ
న్యూఢిల్లీ: ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావో ఖత్రోచితో భోఫోర్సు శత్రుఘ్నుల ఒప్పందానికి సంబంధించిన పత్రాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బిజెపి డిమాండ్ చేసింది. రక్షణ దళానికి చెందిన కాంట్రాక్టుల్లో ఒక విదేశీ వ్యక్తికి చోటివవ్వడంపై బిజెపి మాజీ అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటరీ నేత ఎల్కె అద్వాని అభ్యతంరం వ్యక్తం చేశారు. అమల్లోకి వచ్చిన సమాచార చట్టం ప్రకారం ఒప్పంద పత్రాలను పార్లమెంట్ ముందు పెట్టడం చట్టం ఉల్లంఘన కిందకు రాదని అద్వాని అన్నారు. సోనియా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఖత్రోచి గర్వంగా చెప్పుకుంటారని, మరి అలాంటపుడు భారత్ వచ్చి విచారణ ఎదుర్కోమని ఖత్రోచికి సోనియా ఎందుకు చెప్పరని అద్వాని నిలదీశారు.
Comments
Story first published: Saturday, March 11, 2006, 23:53 [IST]