వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో మరో రెండు రోజులు అకాల వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ఈ ద్రోణి మహారాష్ట్ర నుంచి శ్రీలంక వైపుగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం ఉదయం వర్షం కురిసినా శనివారం మాత్రం వాతావరణం పొడిగా ఉంది. అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై మరో రెండు రోజులు ఉంటుందని, వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వారు తెలిపారు. రాష్ట్రంలో 14 జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల మామిడి, పొద్దుతిరుగుడు, ద్రాక్ష, మిర్చి, సెనగ పంటలు నష్టపోయినట్టు సమాచారం.
Story first published: Saturday, March 11, 2006, 23:53 [IST]