వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతపురం జిల్లాలో భారీ ఎన్కౌంటర్
అనంతపురం: అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి వద్ద శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో అనంతపురం జిల్లా మావోయిస్టు దళ కమాండర్ శ్రీధర్ అలియాస్ రామ్ మోహనరెడ్డి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఇటీవల ఇద్దరు రెవిన్యూ ఉద్యోగులను శ్రీధర్ అలియాస్ రామ్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. చెన్నై కొత్తపల్లి ప్రాంతంలో మావోయిస్టు కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని పసిగట్టిన పోలీసులు శుక్రవారం నుంచి తీవ్రమైన గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ను కూడా పోలీసులు ఉపయోగించారు.
Comments
Story first published: Saturday, March 11, 2006, 23:53 [IST]