కోర్టులు సంయమనం పాటించాలి: ప్రధాని
న్యూఢిల్లీ: న్యాయస్ధానాలు తమ అధికారాలను ఆచితూచి వినియోగించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింంగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం ప్రారంభంమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ప్రజాసామ్య వ్యవస్ధలో కోర్టులు ప్రధాన పాత్ర వహిస్తాయని, కోర్టు తన అధికారాలను వినియోగించేటపుడు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలోనూ అవినీతి పెచ్చుమీరడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు తగిన సంస్కరణలు చేపట్టాలని ప్రధాని పిలుపు నిచ్చారు. న్యాయస్థానాల్లో దఖాలవుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ప్రజాహితం కోరేవిగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మాటమార్చే సాక్షుల వల్ల ఒక్కొక్కసారి కోర్టుతీర్పులు ప్రభావితమయ్యే అవకాశముందని ఇటువంటి వారి విషయంలో కోర్టులు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు.