వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టుకు హాజరైన పోలీసు కమీషనర్‌ మహంతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మిస్సింగ్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసు కమీషనర్‌ మహంతి సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పోలీసుల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళహాట్‌కు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఎనిమిది నెలల క్రితం నుంచి కనిపించడం లేదు. కృష్ణ తండ్రి మూడు నెలల క్రితం తన కుమారుడు తప్పిపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ పోలీసులు కృష్ణ జాడను కనిపెట్టలేకపోయారు. దీంతో కృష్ణ తండ్రి హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

కృష్ణ తండ్రి వేసిన పిటిషన్‌పై ప్రతిస్పందిస్తూ హైకోర్టు - కృష్ణ ఆచూకీని వారంలోగా కనిపెట్టాలని, లేని పక్షంలో తమ ముందు హాజరు కావాలని మహంతిని ఆదేశించింది. కృష్ణ జాడ తీయలేకపోయిన పోలీసులు కమీషనర్‌ సోమవారంనాడు హైకోర్టుకు హాజరయ్యారు. కనిపించకుండా పోయిన ఒక వ్యక్తినే పట్టుకోలేని పోలీసులు నేరాలను ఎలా అదుపు చేయగలదని కోర్టు ప్రశ్నించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X