వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస నేతలపై అసంతృప్తి అబద్ధం: జయశంకర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వంపై అసంతృప్తితో తాను జాతీయ అసంఘటిత కార్మికుల కమీషన్ పదవికి రాజీనామా చేశాననే వార్తల్లో నిజం లేదని ప్రొఫెసర్ జయశంకర్ స్పష్టం చేశారు. తెరాస నాయకత్వంపై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఢిల్లీలో తాను చేయాల్సిన పని పూర్తయిందని, అందుకే పదవికి రాజీనామా చేశానని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయ సాధన కోసం జరిగిన కృషిలో పాలు పంచుకునే అవకాశం తనకు లభించిందని, ఆ పని పూర్తయిందని, అందుకే తాను పదవికి రాజీనామా చేసి తిరిగి వచ్చానని ఆయన అన్నారు. తెరాస నాయకత్వానికి, తనకు మధ్య పరస్పర అవగాహన ఉందని, కలిసి పని చేశామని, కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. తాను సంతోషంగా, తృప్తిగా తిరిగి వస్తున్నానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, March 15, 2006, 23:53 [IST]