వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రంగారెడ్డి జిల్లాలో 300 ఏళ్ల నాటి మ్యానుస్క్రిప్టులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో 800 మ్యానుస్క్రిప్ట్లు లభించాయి. ఇందులో 300 తాళపత్రాలు ఉన్నాయి. ఇవి 300 ఏళ్లనాటివి. ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వే సందర్బంగా ఈ మ్యానుస్క్రిప్ట్లు లభించినట్లు సర్వే జిల్లా కో ఆర్డినేటర్ వెంకటాచారి బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో 300 ఏళ్ల నాటి దేవనాగరి లిపిలో ఉన్న ప్రతులు లభించాయని, తురుమామిడి గ్రామంలో వంద గ్రంథాలు, శంకరపల్లి, వికారాబాద్లలో 70 చొప్పున మ్యానుస్క్రిప్ట్లు లభించాయని ఆయన వివరించారు. తురుమామిడిలో లభించిన ప్రతులు జోతిష్య శాస్త్రానికి చెందినవని, వికారాబాద్, ఘట్కేసర్లలో దొరికినవి వైద్యానికి సంబంధించినవని ఆయన వివరించారు. ఇతర ప్రతులు చాలా వరకు మతసంబంధమైనవని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, March 15, 2006, 23:53 [IST]