వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోలీ వేడుకల్లో విషాద సంఘటనలు
హైదరాబాద్: హోలీ వేడుకల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్నానాలకు వెళ్లి కొంత మంది మృతి చెందగా, మరికొంత మంది గల్లంతయ్యారు. హైదరాబాద్లో రెండు వేర్వేరు సంఘటనల్లో స్నానానికి వెళ్లి ముగ్గురు మరణించారు. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సూరారం చెరువులో ఒక యువకుడు మరణించగా, షేట్ బషీరాబాద్లోని మున్నా చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మరణించారు.
రంగారెడ్డి జిల్లా కీసర తామరకొలనులో మునిగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఖమ్మంజిల్లాలో గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. వీరు ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందినవారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. కెసి కెనాల్లో మునిగి నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురిలో ఇద్దరు విద్యార్థులని తెలుస్తోంది.
Comments
Story first published: Wednesday, March 15, 2006, 23:53 [IST]