వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ సంబరాల్లో మునిగి తేలిన ఎమ్యెల్యేలు

By Super Admin
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శాసనసభ్యులు కొంతమంది బుధవారంనాడు ఉత్సాహభరితంగా హోలీ సంబరాలను జరుపుకున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పయ్యావుల కేశవ్‌, తదితరులు రంగులు చల్లుకుని ఉల్లాసంగా గడిపారు. వారు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి వెళ్లారు. చంద్రబాబుకు కూడా వారు రంగులు పూశారు. హోలీ కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే పర్వదినం అని చంద్రబాబు అన్నారు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలను ఈ పండుగ పటిష్టం చేస్తుందని ఆయన అన్నారు.

అనంతరం వారు స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు కూడా రంగులు పూశారు. శాసనసభ్యులతో హోలీ జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని సురేష్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు, శాసనసభ్యులకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్‌ శాసనసభ్యుడు పి. జనార్దన్‌ రెడ్డి రంగుల్లో మునిగి తేలారు. ఆయన పార్లమెంటు సభ్యుడు ఎన్‌. జనార్దన్‌ రెడ్డి, పాఠశాల విద్యామంత్రి ఎన్‌. రాజ్యలక్ష్మి దంపతుల నివాసానికి వెళ్లి వారిపై కూడా రంగులు చల్లారు. కులమతాలకు అతీతంగా మనుషులు ఆనందంగా జరుపుకునే పర్వదినం హోలీ అని పి. జనార్దన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల మధ్య హోలీ జరుపుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X