హోలీ చేసుకుంటున్న తెలంగాణ మేధావుల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయంలో హోలీ నిర్వహించుకుంటున్న తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులను, విద్యార్థులు ఆరుగురిని పోలసులు బుధవారం అరెస్టు చేశారు. అనుమతి లేకుండా హోలీ నిర్వహించుకుంటున్నారనే ఆరోపణపై పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడ్డారు. విద్యావంతుల వేదిక నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ను, పాశం యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు.
హోలీ ఉత్సవం వార్తను సేకరించడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. తెలంగాణ పేరెత్తితే ఖబడ్దార్ అంటూ పోలీసులు హెచ్చరించారు. పోలీసుల చర్యను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి ఖండించారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ చర్యను తెలంగాణ మేధావులు ఖండించారు. పోలీసు చర్యకు నిరసనగా తెలంగాణ విద్యార్థులు గురువారం ఉస్మానియా యూనివర్శిటీ బంద్కు పిలుపునిచ్చారు.