వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యక్తిగత పర్యటనపై చెన్నైలో వైయస్
చెన్నై: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బుధవారంనాడు చెన్నై వచ్చారు. ఆయన మొదట తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సమాచార కేంద్రానికి వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం కోడంబాకంలో మరణించిన ఒక మిత్రుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆ తర్వాత డియంకె కార్యాలయం ఆవరణలో గల ఒక కళ్యాణమండపంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. ఆయన ఈ వివాహానికి వచ్చిన సందర్భంలో డియంకె నేత కరుణానిధి కార్యాయలంలోనే ఉన్నారు. అయితే వైయస్ కరుణానిధిని కలుసుకోలేదు. వైయస్ వెంట ఆయన సన్నిహిత మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.పి. రామచందర్ రావు కూడా ఉన్నారు.
Comments
Story first published: Wednesday, March 15, 2006, 23:53 [IST]