వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియా సంఘటనలో సిఐ, ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: హోళీ పండగ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ మేధావులపై దాడి చేసిన పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం సస్పెండ్ చేసింది. ఈ సంఘటకు బాధ్యులైన సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు హోమంత్రి జానారెడ్డి ప్రకటించారు. హోళీ పండగ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో హోలీ వేడుకలు జరుపుకుంటున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసుల అనుచిత ప్రవర్తనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
Comments
Story first published: Thursday, March 16, 2006, 23:53 [IST]