వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కామన్వెల్త్ గేమ్స్లో కుంజరాణి బంగారు బోణి
మెల్బోర్న్: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ బంగారు బోణీ చేసింది. వెటరన్ వెయిట్లిఫ్టర్ కుంజరాణి దేవి గురువారం ఇక్కడ జరిగిన 48 కేజీ విభాగంలో అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్లో ఇదే కేటగిరిలో బంగారు పతకాన్ని గెల్చుకున్న కుంజరాణి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. స్నాచ్లో 72 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 94 కేజీలతో కలిపి మొత్తం 166 కేజీల బరువెత్తిన కుంజరాణి అదే క్రమంలో నూతన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పింది. నాలుగేళ్ల క్రితం మాంచెస్టర్ గేమ్స్లో కుంజరాణి పేరిటే ఉన్న క్లీన్ అండ్ జెర్క్ (92.5 కేజీలు) రికార్డును మెల్బోర్న్లో ఆమె బద్దలుకొట్టింది.
Comments
Story first published: Thursday, March 16, 2006, 23:53 [IST]