వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపితో జోడీకి టిఆర్ఎస్ యత్నాలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ శుక్రవారంనాడు హైదరాబాద్ రానున్న సందర్భంగా తెలంగాణా నినాదానికి ఆయన మద్దతు చూరగొనడానికి కేంద్ర మంత్రి నరేంద్ర గురువారం నాడు తీవ్ర ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చిన్న రాష్ట్రాల నినాదానికే కట్టుబడి ఉన్నందున తెలంగాణా నినాదానికి మద్దతు ప్రకటించడం పెద్ద విషయమేమీ కాదని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.
అయితే తెలంగాణాకోసం ఉద్యమం ప్రారంభించి, ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మంత్రి పదవులు సైతం తీసుకున్న టి.ఆర్.ఎస్. చిత్తశుద్ధి ఏపాటిదన్న సందేహాన్ని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యక్తం చేశారు. అందువల్ల ముందు టి.ఆర్.ఎస్. నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తే తప్ప వారిని నమ్మే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు.
Story first published: Thursday, March 16, 2006, 23:53 [IST]