వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియాలో జులుంపై అసెంబ్లీలో గంద్రగోళం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపైన, తెలంగాణా మేథావులపైనా పోలీసులు సాగించిన జులుం గురువారం ఉదయం అసెంబ్లీని కుదిపేసింది. ఈ దుర్ఘటన చాలా హేయమైందని అటు మిత్రపక్షమైన టి.ఆర్‌.ఎస్‌. సభ్యులు, ఇటు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులూ వాదిస్తూ ఈ సంఘటనపై సమాధానం చెప్పాలని, పండుగనాడు అన్యాయంగా పోలీసు జులుం ప్రదర్శించిన సి.ఐ. ని సస్పెండ్‌ చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

అయితే ఈ సంఘటన గురించిన పూర్వాపరాలను తెలుసుకుంటున్నామని, శుక్రవారం నాడు ఈ విషయమై ప్రకటన చేయగలమనీ హోమ్‌ శాఖ మంత్రి జానారెడ్డి వివరించారు. రేపటి వరకూ ఆగడానికి వీలులేదని వారు ఆందోళన వ్యక్తం చేయగా, జరిగిందంతా టి.వి. లో చూశామని, సి.ఐ. తప్పు స్పష్టంగా కనిపిస్తున్నందున ఆ సి.ఐ. పై వెంటనే చర్య తీసుకోవాలని తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ విషయాన్ని మరింత పెద్దది చేసుకోవద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X