వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ముంబాయిలో ఇంకా ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: నవీ ముంబాయి ప్రాంతంలో ఉద్రికత్తత ఇంకా కొనసాగుతుంది. గత రాత్రి నీరుల్‌ పోలీస్‌స్టేషన్‌రను ముట్టడించిన ఆందోళనకారులు శనివారం రాబేలి పోలీస్‌స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. ఈ మధ్యాహ్నాం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ప్రైవేటు, మీడియా వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రాఫిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రాష్ట్ర రిజర్వ్‌ పోలీసు బలగాలను మోహరించారు.

ఘన్‌సోలి గ్రామస్తులకు, మాతాడి కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ఈ ఉద్రికత్తకు దారితీసింది. హోలీ అనంతరం ఘన్సోలి గ్రామ బాలిక పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ మాతాడి కార్మికుల కాలనీపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. మతాడీ కార్మికుల నుంచి తమను కాపాడలంటూ కోపర్‌కహైనీ, తర్బీ, జుహు, నీరుల్‌ గ్రామల ప్రజలు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X