కొత్త ముంబాయిలో ఇంకా ఉద్రిక్తత
ముంబాయి: నవీ ముంబాయి ప్రాంతంలో ఉద్రికత్తత ఇంకా కొనసాగుతుంది. గత రాత్రి నీరుల్ పోలీస్స్టేషన్రను ముట్టడించిన ఆందోళనకారులు శనివారం రాబేలి పోలీస్స్టేషన్పై విరుచుకుపడ్డారు. ఈ మధ్యాహ్నాం పోలీస్స్టేషన్ సమీపంలో ప్రైవేటు, మీడియా వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రాఫిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించారు.
ఘన్సోలి గ్రామస్తులకు, మాతాడి కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ఈ ఉద్రికత్తకు దారితీసింది. హోలీ అనంతరం ఘన్సోలి గ్రామ బాలిక పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ మాతాడి కార్మికుల కాలనీపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. మతాడీ కార్మికుల నుంచి తమను కాపాడలంటూ కోపర్కహైనీ, తర్బీ, జుహు, నీరుల్ గ్రామల ప్రజలు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు.